నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - దావోస్‌లో మంత్రి కేటీఆర్

సోమవారం, 16 జనవరి 2023 (10:58 IST)
స్విట్జర్లాండ్‌లో జరుగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తాను దావోస్ వచ్చిన ప్రతిసారీ ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా సోమవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమవుతుంది. విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగుతుంది. ఇందులో 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు హాజరువుతారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, ఆశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు