వారం రోజుల పసికందును రూ.3వేలకు అమ్మేసిన కన్నతల్లి!

శుక్రవారం, 18 జూన్ 2021 (17:13 IST)
ముక్కుపచ్చలారని ఆ పసికందును దారుణంగా మూడు వేల రూపాయలకు బేరం పెట్టింది ఓ కన్నతల్లి. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో వెలుగు చూసింది. రాధ అనే మహిళ తన భర్తతో కలిసి స్థానికంగా ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు.
 
కూలీపని చేసుకుంటూ బ్రతికే ఈ దంపతులకు ఏడు రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏమైందో ఏమో కానీ భూమి మీదపడిన మూడు రోజులకే చిన్నారిని స్థానికంగా ఉన్న శాంతమ్మ అనే మహిళకు రూ.3 వేలకు విక్రయించింది. ఆ తర్వాత మరో మూడు రోజులకు మళ్ళీ తన బిడ్డ తనకు కావాలని చిన్నారిని కొనుకున్న మహిళా వద్దకు వెళ్లి తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని కోరింది.
 
కానీ అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు. కన్న తల్లి బ్రతిమాలడంతో పదివేల రూపాయలిస్తే బిడ్డను తిరిగిచ్చేస్తాని చెప్పింది. దీంతో అంత డబ్బు ఇవ్వలేని ఆ తల్లి దిక్కు తోచని స్థితిలో రాధ స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ను ఆశ్రయించింది. అంగన్‌వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు శిశువును సంరక్షణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు