గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడి మృతి

గురువారం, 27 జులై 2023 (11:57 IST)
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటూ వచ్చారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడు పేరు విష్ణువర్థన్ రెడ్డి. వయసు 30 యేళ్లు. 
 
కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడు మృతితో మహిపాల్ రెడ్డి కుటుంబ విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్థన్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తరలించారు. ఆయన అంత్యక్రియలు మరికాసేపట్లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు