బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లండి: కాప్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:56 IST)
కోవిడ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు గుంజుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులైతే రోగి చనిపోయాక కూడా బిల్లు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని మొండికేస్తున్నాయి. 
 
తాజాగా మేడ్చల్ జిల్లాలోని నాగరం మునిసిపాలిటీలోని రాంపల్లికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు వాసు ఐదు రోజుల క్రితం కరోనావైరస్‌తో బాధపడుతూ కాప్రాలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఐదు రోజులుగా అతడి చికిత్స కోసం లక్షన్నర రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. ఐతే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం నాడు కన్నుమూశాడు.
 
దీనితో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు ఆసుపత్రికి వచ్చారు. ఐతే మరో రెండు లక్షలు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గం చెప్పింది. చనిపోయిన తర్వాత బిల్లు ఎందుకు కట్టాలంటూ మృతుడి బంధువులు నిలదీశారు. డబ్బు కట్టి తీసుకెళ్లండి, వాగ్వాదం వద్దని వాసు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనితో అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నిరసనలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు