రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

గురువారం, 2 మార్చి 2023 (10:28 IST)
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను గురువారం బంద్ చేశారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల ఘటనపై ఎన్ఎస్‌యూఐ స్పందించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయించింది. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతున్న సాత్విక్ బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఈ మృతికి శ్రీ చైతన్య యాజమాన్యమే కారణమని ఎస్ఎస్‌యూఐ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఇంకా సాత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాత్విక్ మృతికి నిరసనగా గురువారం శ్రీచైతన్య కళాశాలలను బంద్ చేయాలంటూ వారు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు