కొత్త యేడాదిలో తెలంగాణ ప్రజలకు షాకిచ్చిన విజయ డైరీ

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో విజయ పాల డైరీ తేరుకోలేని షాకిచ్చింది. ఈ డైరీ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెల్సిందే. లీటరు పాలపై రూ.2 పెంచింది. అటు హోల్‌సేల్ మిల్క్ ధర లీటరుకు రూ.4 పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ పెంచిన ధరలు కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
 
అలాగే, 200 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై 50 పైసలు, 300 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై రూపాయి చొప్పిన పెంచినట్టు పేర్కొంది. 500 మిల్లీ లీటర్ల డైట్ మిల్క్‌పై రూపాయి ధరను పెంచింది. అనివార్య పరిస్థితుల్లోనే ఈ ధరలను పెంచామని, వినియోగదారులు పెద్ద మనస్సుతో అర్థం చేసుకోవాలని విజయ పాల డెయిరీ సంస్థ ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు