"గుండు" చేయించుకోవడానికి రెడీ: కత్రినా

తెలుగు ప్రేక్షకులకు ఆధునిక మల్లీశ్వరిగా పరిచయమైన కత్రినాకైఫ్ బాలీవుడ్‌లో దుమ్ము రేపుతోంది. తనకంటే ముందుకు దూసుకుపోతున్నట్లు ఎవరైనా కనిపిస్తే... వారి అవకాశాలను ఇట్టే లాగేసుకుంటోంది. దక్షిణాది తారలైన అసిన్, శ్రియ వంటి తారలను ఓ కంటకనిపెడుతూ రేసులో ముందుకు వెళుతోంది. 

తన కెరీర్‌లో మంచి బ్రేక్‌నివ్వగల కథతో ఎవరైనా వస్తే తాను నటించడానికి రెడీ అంటోందట. ఆఖరికి ఆ పాత్రలో తను గుండు చేయించుకుని నటించమన్నా నటిస్తానని చెపుతోందట.

ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ దర్శకనిర్మాతలు కత్రినాకైఫ్ గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందోనని కొన్ని ఊహా చిత్రాలను గీయించుకోవడమే కాక రచయితలకు ఓ పవర్‌ఫుల్ "గుండు" హీరోయిన్ లీడ్ రోల్ ఉండే విధంగా కథను తయారు చేయమని చెపుతున్నారట. మొత్తానికి కత్రినా "గుండు" ఆలోచన బాలీవుడ్ రచయితల మెదళ్లకు పదును పెట్టిందన్నమాట.

వెబ్దునియా పై చదవండి