అందాలను ఎంతయినా ఆరబోస్తా...రష్మీ...!

బుధవారం, 21 జూన్ 2017 (10:51 IST)
రష్మీ. బుల్లితెర నటిగా ప్రయాణాన్ని ప్రారంభించి సినిమాల్లో అప్పుడప్పుడు నటిస్తూ తళుక్కుమంటోంది. కానీ ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్ కార్యక్రమాలకే ప్రయారిటీ ఇస్తోంది. జబర్దస్త్‌తో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రష్మీ ఆ తర్వాత "గుంటూరు టాకీస్" అనే సినిమాలో నటించింది. అలాగే 'తను వచ్చేనంట' సినిమాలో కూడా నటించింది. సినిమాల్లో పెద్దగా పేరు రాకపోయినా టెలివిజన్‌లలో మాత్రం ఇప్పటికే రష్మీ అంటే యువకులకు క్రేజే.
 
అయితే ఈటీవీ ప్రభాకర్ మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్న ఒక చిత్రంలో రష్మీ గౌతమ్ ప్రధాన పాత్ర పోషిస్తోందట. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఔట్‌పుట్ చాలా బాగా వస్తోందని, ఇది రష్మీకి మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయమంటోంది సినీ యూనిట్. 
 
అయితే ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోందట. సినిమాలో మాత్రం రష్మీ అందాలను ఆరబోస్తోందట. ఈ ఒక్కసినిమానే కాదు తనకు క్యారెక్టర్ నచ్చితే అందాలను ఎంతయినా ఆరబోయడానికి సిద్థమంటోందట. 

వెబ్దునియా పై చదవండి