ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ధర్నా ఎలాంటి పర్మిషన్ లేకుండా లా అండ్ ఆర్డర్ ని విస్మరించి రోడ్ లను బ్లాక్ చేస్తూ చిత్రపురి అవినీతి ని పక్కదారి పట్టడం కోసం, చేసిన ధర్నా పైన తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ కమిషనరేట్ సీరియస్ గా వున్నట్లు తెలిసింది. పరారి లో వల్లభనేని అనిల్ కుమార్, సీక్రెట్ గా పెద్దల దగ్గరికి వెళ్లి కాళ్ళ బేరం చేస్తున్నట్లు సమాచారం.
ఫెడరేషన్ అధ్యక్షుడు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ పైన సైబరాబాద్ కమిసినరేట్ లో అవినీతితోపాటు సుమారు 22 క్రిమినల్ కేసులున్నాయి, పీడీ యాక్ట్ లేకుండా పక్కదోవ పట్టడం కోసం, చిత్రపురి కొత్తగా నిర్మించే టవర్స్ లు కోర్ట్ స్టే లో ఉన్నా కూడా చండి యాగం పేరు తో భూమి పూజ చేయడం ఇలాంటి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఫెడరేషన్ ప్రెసిడెంట్ మరియు చిత్రపురి ప్రెసిడెంట్ పైన వెంటనే పీడీ యాక్ట్ పెట్టి వల్లభనేని అనిల్ కుమార్ ని జైలు లో వేయాలని చిత్రపురి బాధితులు, సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు
నిర్మాతలమండలికి హాజరుకావడంలేదా?
పరారీ లో వున్న నాయకుడితో సవారీ ఎలా సాధ్యం. ఈ రోజు అనగా గురువారంనాడు జరగాల్సిన నిర్మాతలతో మీటింగ్ కి ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హాజరు కావడం లేదు. చిత్రపురి లో వున్న 22 క్రిమినల్ కేసులు అనేక ఆర్ధిక ,,నేరపూరిత కేసులలో అతని గురించి పోలీసులు ప్రయత్నించగా నిన్నటినుండి ఆతను పరారీలో ఉన్నట్టు సమాచారం ..ఈ కారణంగా చర్చలకు ప్రతిష్టంబన ఏర్పడింది.
ఎలాగో ఫెడరేషన్ కాల పరిమితి ఏప్రిల్ తో అయిపోయింది కాబట్టి మీరు ముందు మీ 24 క్రాఫ్ట్ లలోనుంచి మరొక నాయకుడిని ఎన్నుకుని రండి అప్పుడే చర్చలు జరుగుతాయి. నేరచరిత్ర కలిగినవాడిని మీరు నాయకుడిగా ఎలా గుర్తిస్తారు. ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదు అని నిర్మాతలు పట్టుదలగా వున్నారు. ఈ నేపధ్యం లో అమాయకులైన కార్మికులు బలైపోతున్నారు. కార్మికుల క్షేమం గురించి మరో నాయకుడిని ఎన్నుకుని వెంటనే చర్చలకు రమ్మని చిన్న నిర్మాతలు ..పెద్ద నిర్మాతలు ..యాక్టివ్ నిర్మాతలు అందరూ ఇదే అడుగుతున్నారు ..మొత్తానికి కార్మికులను అనాధలను చేసిన అనిల్ కుమార్ ..పరార్ ..కార్మికసోదరులారా పారా హుషార్ అంటూ చిత్రపురి ఉద్యమకారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.