డాన్సింగ్ స్టార్ సునీల్ హీరోగా, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ''ఈడు గోల్డ్ ఎహే''. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్వైడ్గా రిలీజ్ చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
టాలీవుడ్లో కమెడియన్గా పాపులర్ కావడం వలన ఇక్కడ తాను విలన్గా చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనీ, ఇతర భాషల్లో చేసే ఆలోచన ఉందని చెప్పాడు. ఇతర భాషల నుంచి విలన్గా ఆఫర్స్ బాగానే వస్తున్నాయనీ, వచ్చే ఏడాది విలన్గా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని అన్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తానని అన్నాడు.