సెలబ్రిటీలు డబ్బులిచ్చి ప్రచారం చేసుకుంటారు : ప్రియమణి

డీవీ

బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:31 IST)
Priyamani
నటి ప్రియమణి అన్నిభాషల్లోనూ బిజీగా వుంది. కొంత గ్యాప్ తీసుకున్నా ఏదో రూపంలో ఆమె నటనను ప్రదర్శిస్తుంది. వెబ్ సిరీస్ లోనూ ఆమె నటిస్తూ భామా కలాపం 2 కూడా చేసింది. కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ఇక హిందీలో కొటేషన్ గ్యాంగ్ అనే సినిమా చేస్తుంది. ఇటీవలే ప్రమోషన్ లో భాగంగా పాడ్ కాస్ట్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఆమె సెలబ్రిటీలపై స్పందించాల్సి వచ్చింది.
 
ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఇతరత్రా సెలబ్రిటీలు జిమ్ లకు వెళుతున్నా, షాపింగ్ కు వెళుతున్నా, ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నా ఫొటోగ్రాఫర్లు షడెన్ గా వచ్చేసి సందడి చేస్తారు. ఎంతమంది రావాలి, ఏ ఏ ఫొటోగ్రాఫర్లు రావాలి అనేవి ముందుగా మేనేజర్లు ప్లాన్ చేసి పెడతారు. అందుకు తగినవిధంగానే ప్రశ్నలు కూడా వేస్తుంటారు.  దానిని వైరల్ చేసే బాధత్య వారిదే.  అందుకు తగిన ప్రతిఫలం వుంటుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. 
 
ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువగా వుంటుంది. ఇవి ఇండ్రస్టీకి తెలిసినా ప్రియమణి చెప్పడంతో కామన్ మాన్ కూడా కిటుకు తెలిసిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం అంటేనే డబ్బుమయం అంటూ సెలవిచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు