రష్మికను ఆటాడుకున్న సితార - ఆద్య (వీడియో)

శుక్రవారం, 10 జనవరి 2020 (17:24 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో ఓ కీలక పాత్రను విజయశాంతి కూడా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ ఓ సైనికుడి పాత్రలో నటించాడు. 
 
అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, హీరో మహేష్ కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యలు కూడా పాలుపంచుకుంటున్నారు. ఇందులోభాగంగా, తాము సొంతంగా ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌లో రష్మికను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో రష్మికను సితార ఓ ఆటాడుకుంది.
 
ఈ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలో 3 మార్క‌ర్ ఛాలెంజ్ అంటూ మొద‌లు పెట్టిన యూట్యూబ్‌లో ప‌లు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నారు ఈ చిన్నారులు. తాజాగా ర‌ష్మిక‌తో క‌లిసి సంద‌డి చేశారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి. ఈనెల 9వ తేదీన అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2.80 లక్షల మంది వరకు నెటిజన్లు వీక్షించడం గమనార్హం. 12 వేల మంది నెటిజన్లు లైక్ చేశారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు