చిరునవ్వులు చిందిస్తూ భర్తతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన 'చందమామ'

సోమవారం, 26 అక్టోబరు 2020 (13:44 IST)
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తేదీన పెళ్ళికూతురు కానుంది. ముంబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడనుంది. ఆ రోజున దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో ఆమె ఓ ఫొటో దిగి పోస్టు చేసింది. 
 
'మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోలో వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నారు. కాగా, ఇప్పటికే వారి ఇళ్లలో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ తన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపించింది. ఇటీవల కిచ్లూ ఓ పోస్ట్‌ చేస్తూ తాము వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నామని చెప్పాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు కొత్త ఇంట్లో ఉండనున్నారు.

 

Beautiful couple @MsKajalAggarwal and @kitchlug ❤️ pic.twitter.com/LH9Kv2BndD

— Kajal Fan Ravi (@KajalFanRavi) October 25, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు