వయసుతో సమంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారని ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వినియోగంపై మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగంపై తనకు ఎంతో ఆందోళనగా ఉందన్నారు. గుర్తింపు కోసం ప్రజలంతా ఆరాటపడుతున్నారని ఇది ఏమాత్రం మచింది కాదన్నారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిందన్న అంశంపై ఐశ్వర్యా మాట్లాడుతూ, సోషల్ మీడియా పోస్టులకు వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవన్నారు. మన విలువను ఏది నిర్ణయించలేదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. నా దృష్టిలో సోషల్ మీడియాకు, సామాజిక ఒత్తిడికి మధ్య పెద్ద తేడా లేదు. తల్లిగా నాకు ఈ విషయంలో ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. దాన్ని దాటి చూసినపుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మగౌరవం కోసం సామాజిక మాధ్యమాల్లో వెతకొద్దు. అది ఖచ్చితంగా అక్కడ దొరకదు" అని ఐశ్వర్యా రాయ్ అన్నారు.