చైతూ మాయలో నేనే పడిపోయా-సమంత

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:05 IST)
ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న అందాల తార సమంత అక్కినేని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అక్కినేని అనే ఇంటిపేరు వచ్చాక తనకు బాధ్యత పెరిగిందని చెప్పింది. సాధారణమైన సమంతగా తాను ఏమైనా చేయవచ్చు. ఏదైనా మాట్లాడవచ్చు.. కానీ అక్కినేని అనే ఇంటిపేరు వలన తానెంతో బాధ్యతగా వుండాల్సి వుందని తెలిపింది. 
 
శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్ సినిమాలు ఒకేసారి విడుదల కావడం గురించి సమంత స్పందిస్తూ.. ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్స్‌కి రావాలని ప్లాన్ చేసింది కాదని, అనుకోకుండా అలా జరిగిపోయిందంతేనని చెప్పుకొచ్చింది. ''ఏ మాయ చేసావె'' సినిమాతోనే చైతూ మాయలో పడ్డానని సమంత తెలిపింది. ఇంట్లో అపర్ హ్యాండ్ చైతూదే అని సమంత తెలిపింది. 
 
చైతూ తాను ఇద్దరం బేబీ అని పిలుచుకుంటామని.. తన మామగారు అక్కినేని నాగార్జున చాలా బాగా చూసుకుంటారని.. మంచి స్నేహితుడని చెప్పుకొచ్చింది. కమెడియన్లలో బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్ అంటే తనకు ఇష్టమని తెలిపింది.
 
చైతూ తొలి సినిమా నుంచి మంచి స్నేహితుడని, ఆయనను తాను మాయ చేయలేదని.. చైతూ మాయలో తానే పడిపోయానని సమంత చెప్పింది. ఇక అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు సమంతను పరిచయం చేశారని అలీ చెప్పాడు.
 
సమంత తన కింద పనిచేసేవారిని ఫ్యామిలీలా చూసుకుంటుందని.. అక్కినేని కుటుంబంలో మళ్లీ అన్నపూర్ణమ్మ పుట్టిందని అలీ కొనియాడాడు. సమంత కాంబోలో నటించిన అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అయ్యాయని అలీ గుర్తు చేసుకున్నాడు. షూటింగ్‌లో అందరితో కలిసిపోయే సమంత.. పేకప్ చేశాక జిమ్‌కెళ్లి వర్కౌట్స్ చేస్తుందని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు