రూ.200 కోట్ల కబ్‌కు చేరువగా అల వైకుంఠపురములో

ఆదివారం, 19 జనవరి 2020 (16:25 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నింటిలోకెల్లా ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంల ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ అంటే గత ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి రూ.200 కోట్ల కబ్బులో అడుగుపెట్టే దిశగా దూసుకెళుతోంది. 
 
ఏరియాల వారీగా ఈ చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే, నిజాం రూ.28.84 కోట్లు, సీడెడ్ రూ.15.45 కోట్లు, వైజాగ్ రూ.15.01 కోట్లు, గుంటూరు రూ.8.58 కోట్లు, ఈస్ట్ రూ.8.12 కోట్లు, వెస్ట్ రూ.6.40 కోట్లు, కృష్ణా రూ.7.40 కోట్లు, నెల్లూరు రూ.3.50 కోట్లు, ఏపీ అండ్ తెలంగాణ రూ.93.3 కోట్లు, కర్నాటక రూ.9.3 కోట్లు, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.25 కోట్లు, యూఎస్ రూ.9.0 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.3.25 కోట్లు కాగా, మొత్తం షేర్ రూ.118.1 కోట్లుగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు