టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, హరీష్శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బన్నీపై క్లాప్ కొట్టగా.. శ్యాంప్రసాద్రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. బన్నీకి గతంలో సూపర్హిట్ సాంగ్స్ అందించిన దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దర్శకుడు వంశీపైడిపల్లి ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.