యాంకర్ శ్యామల భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (15:45 IST)
ప్రముఖ టీవీ యాంకర్, నటి శ్యామల భర్త నరసింహరెడ్డితో పాటు మరో మహిళను అరెస్టు చేశారు. వారిపై ఒక మహిళ చీటింగ్ కేసు పెట్టింది. ఈ కేసును నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు.
 
మహిళ తన ఫిర్యాదులో, శ్యామల భర్త నరసింహరెడ్డి 2017 నుండి వాయిదా ప్రాతిపదికన తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నారని తెలిపింది. తన డబ్బు గురించి అతనిని అడిగినప్పుడు, శ్యామల భర్త నరసింహ రెడ్డి తనను బెదిరించారని తెలిపింది. అంతేకాకుండా నరసింహా రెడ్డి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు తెలిపింది.
 
సమస్యను పరిష్కరిస్తానంటూ వివాదం మధ్యలోకి మరో మహిళ వచ్చిందని ఆమె చెప్పారు. వీరిరువురూ తనను బెదిరించారనీ, డబ్బులు ఇవ్వకుండా వేధించారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
కాగా శ్యామల తన భర్తతో కలిసి 2019లో వైయస్‌ఆర్‌సిపి పార్టీలో చేరింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలాను కలిశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు