'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

ఠాగూర్

గురువారం, 21 ఆగస్టు 2025 (12:36 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "విశ్వంభర". అయితే, ఈ చిత్రం విడుదలపై తేదీపై అప్‌డేట్ ఇచ్చారు. దీని ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 'విశ్వంభర' ఎదురు ఆలస్యమవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా రెండో భాగం మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్తుత్తమగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధాన కారణమన్నారు. 
 
ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ ఆలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా దీన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. 2026 సమ్మర్‌‍లో ఎంజాయ్ చేయండి అని తెలిపారు. 
 
కాగా, ఈ చిత్రం చిత్రీకరణ పనులన్నీ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటించారు. కునాల్ కపూర్ ముఖ్య భూమిక పోషించారు. బాలీవుడ్ తార మౌనిరాయ్ ప్రత్యేక గీతంలో మెరవనున్నారు. వంద మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. దీంతో ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనున్నట్టు తెలుస్తోంది. చిరు, మౌనిరాయ్ ఇద్దరూ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటతో థియేటర్‌లో జోష్ నింపనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు