చిరంజీవి విత్ డ్రా చేసుకోమన్నారు.. ప్రకాష్, నాగబాబు సపోర్ట్ కావాలి: మంచు విష్ణు

సోమవారం, 11 అక్టోబరు 2021 (21:28 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా దానిపై రచ్చ ముగియలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నన్ను సైడ్ అవ్వమని చెప్పారని, విత్ డ్రా చేసుకోమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పకూడదని అనుకున్నప్పటికీ ఎన్నికలు ముగియడంతో చెప్పా.. అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. 
 
రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడే అయినా తన ఓటు ప్రకాష్ రాజ్ కే వెళ్లిందని అన్నారు. ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను నేను ఆమోదించబోనన్నారు. ప్రకాష్ రాజు గారి ఐడియాలు, వారి అనుభవం నాకు కావాలని అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. 
 
నాన్ తెలుగు అనే ప్యాక్టర్ ప్రకాష్ రాజ్ ను ఓడగొట్టింనేది నేను నమ్మను అన్నారు. 250 మంది వరకు తెలుగు వాళ్లు ఓట్లేసి ప్రకాష్ రాజును కావాలని కోరారని విష్ణు చెప్పారు. శ్రీకాంత్ తో కలిసి పనిచేస్తానిని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్ రాజ్‌కు ఓటేశాడని మా మధ్య అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు. చరణ్ నాకు సోదరుడు" అని తెలిపారు.
 
ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న మంచు విష్ణు..​. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను అని తెలిపారు. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించనని... త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతానని అన్నారు. అలాగే ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామాను కూడా ఆమోదించను అని చెప్పారు. వాళ్లిద్దరి సపోర్ట్ నాకు కావాలని అన్నారు విష్ణు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు