రెండు సినిమాలకు 25 కోట్లు నష్టపోయిన దిల్ రాజు అందుకే ఇలా చేశాడా !

డీవీ

గురువారం, 25 జనవరి 2024 (17:39 IST)
Dil Raju
పంపిణీదారుడిగా, నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా వున్న దిల్ రాజు ఎత్తుపల్లాలు చూశారు. ఓ సినిమాలో వస్తే మరో సినిమాలో పోతుంటాయి. ఒక్కోసారి వరుస ప్లాప్ లతో కోట్లు నష్టపోతుంటాయి. మరి అవన్నీ సంపాదించుకోవాలంటే ఎట్లా? ఏదో  ఒకటి చేయాలి. అలా అని చట్టబద్ధంగా ఎటువంటి పనులు చేయను అని తేల్చిచెబుతున్నాడు దిల్ రాజు. తాజాగా గుంటూరు కారం సినిమా థియేటర్ల విషయంలో కలెక్షన్ల కాంట్రవర్సీ గురించి ఇటీవలే నిర్మాత వంశీ తెలుపుతూ, ఈ కలెక్షన్లు ఫేక్ కాదు అని చెప్పారు.
 
ఇక దిల్ రాజు అయితే నేను పంపిణీదారుడిగా రెండు సినిమాలకు కలిపి 25 కోట్లు నష్టపోయాను అంటూ. మహేష్ బాబు, మురగ దాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ తో 12  కోట్లు నష్టపోయాను. చిన్నబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో తీసిన సినిమా అజ్జాతవాసి  ఫ్యాన్సీ రేటుకు కొన్నాను. దాంతో 25 కోట్లు పోగొట్టుకున్నానంటూ ఓ ఇంటర్వూలో తెలిపారు. మరి అందుకేనా గుంటూరు కారంలో వాటిని రాబట్టుకోవాలని థియేటర్లు ఎక్కువ తీసుకున్నారనే ప్రశ్నకు నవ్వుతూ.. నేను ఏమి చెప్పినా మీరు ఏదో రాసేస్తారు. రాసుకోండి. నిజం నాకు తెలుసు అంటూ ముక్తసరిగా ముగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు