అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

దేవీ

గురువారం, 12 జూన్ 2025 (18:27 IST)
Pawan, chiru, ntr, allu arjun
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు. వారి మాట్లలో తెలుసుకుందాం. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్ లో...  అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానం #AI171 లో జరిగిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఇది ఎంత హృదయ విదారకమో చెప్పడానికి మాటలు సరిపోవు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి మరియు ప్రార్థనలు! వారి ఆత్మకు శాంతి చేకూరాలి అన్నారు.
 
నందమూరి బాలకృష్ణ : గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం ఓ ఘోర దుర్ఘటన. మాటలకందని విషాదం. యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదం లో భారతీయులతో పాటు విదేశస్తులూ మరణించడం బాధాకరం.  ప్రయాణీకులతో పాటు సిబ్బంది..విమానం కూలినచోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోంది.ఈ జాతీయ విపత్తులో ప్రతి వక్కరం కేంద్రానికి బాసటగా నిలుద్దాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను.
      
అల్లు అర్జున్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా హృదయ విదారకం 
 
విజయ్ ఆంథోనీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. దుఃఖిస్తున్న కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తోంది. ఈ చీకటి ఘడియలో వారికి బలం చేకూరుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు