బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన గ్రిప్పింగ్ స్కోర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈనెల 30న సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.