పపర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని జూన్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.
నిజానికి ఈ చిత్రానికి తొలుత దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది క్రిష్ జాగర్లమూడి. అయితే ప్రాజెక్టుకు ఎక్కువ సమయంపట్టడంతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయ స్థానంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఎపుడో ప్రారంభమైన ఈ చిత్రం కోవిడ్తో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, ఇలా అనేక కారణాల వల్ల చిత్రం విడుదలలో జాప్యం నెలకొంది. మే నెలలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన పవన్ ఇపుడు.. ఆ తర్వాత డబ్బింగ్ను కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశారు. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు.