ఈ కార్యక్రమంలో హీరోలు ధనుష్, నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, భరత్ నారంగ్, సిమ్రాన్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, లిరిక్ రైటర్స్ వివేక, చంద్రబోస్, నంద కిషోర్ పాల్గొన్నారు. వారందరూ ఈ సినిమా గురించి తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ధనుష్ అద్భుతమైన వ్యక్తి, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత, అరుదైన ఆల్ రౌండర్. కుబేరా ఒక అద్భుతమైన చిత్రం. ధనుష్, నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ మెస్మరైజింగ్ గా వుంటుంది. కుబేర బ్రిలియంట్ ఫిల్మ్. ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్ పీరియన్స్ వుంటుంది. మూవీ టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు'తెలిపారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అడయార్లో పుట్టి, గిండి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నాను. చెన్నై కుటుంబంలో వివాహం చేసుకుని, ఇక్కడే తన కెరీర్ను ప్రారంభించాను. చెన్నై ప్రేక్షకుల నుండి సంవత్సరాలుగా తనకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు. “కుబేర' ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. శేఖర్ కమ్ముల గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా తర్వాత సూపర్స్టార్ రజనీకాంత్ కూలీ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి రెడీ వుంది'అన్నారు.
హీరో ధనుష్ మాట్లాడుతూ.. “ఓం నమః శివాయ”. “ఇది కలికాలం, ద్వేషం, ప్రతికూలత, అసూయ వృద్ధి చెందే సమయం. చెడు మంచిపై విజయం సాధిస్తున్నట్లు అనిపిస్తుంది. శేఖర్ కమ్ముల గారు ప్యూర్ సోల్ వున్న వ్యక్తి. సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలు సునీల్, జాన్వి నారంగ్కు కృతజ్ఞతలు. తిరుపతి ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించి, బిచ్చగాడిని నటించిన విజవల్ వెరీ మెమరబుల్. ఆ అనుభవం జీవితంలోని ముఖ్యమైన సత్యాలను గుర్తు చేసింది, బనారస్లోని రాంఝానా చిత్రీకరణ సమయంలో, చితుల మధ్య గడిపిన సమయంలో “దురాశ, డబ్బు, ప్రాపంచిక సుఖాలు - అవి ఏమీ శాశ్వతం కాదని అర్ధమైయింది, “స్వచ్ఛమైన మనసు ముఖ్యం. కుబేర దానిని తెలియజేస్తుంది. ఈ చిత్రం చూపే ఇంపాక్ట్ గురించి నాకు 2000% నమ్మకం ఉంది' అన్నారు. ఈ చిత్రం జూన్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది.