Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

దేవీ

శనివారం, 31 మే 2025 (17:35 IST)
Chiru Autrograph on Sekar poster
పెద్ద తెరపై కథలకు ప్రాణం పోసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయనతో కలిసిన క్షణాలను అందరికీ తెలియజేశారు. ఆయన్ను ఇంటిలో కలిసినప్పుడు పలికిన ఆహ్వానం పలుకరింపు శేఖర్ కు మంత్ర ముగ్తులను చేశాయి. వాటిని నెమరేసుకుంటూ చిన్నతనంలో వుండగా తాను మిమ్మల్మి చూసిన విధానం, స్పూర్తి ఎంతగానో వున్నాయని ఒక్కసారి ఆయన ముందుంచారు.

Chiru- Sekhar kammula
దర్శకుల టీమ్ అంతా శేఖర్ ను చిరంజీవి దగ్గరకు వెళ్ళేలా 25 ఏళ్ళ గుర్తింపు ఓ చార్ట్ ను తయారుచేసి ఇచ్చారు. దానిని తీసుకుని ఆయన పరవశించిపోయారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో ఇలా తెలియజేశారు.
 
టీనేజ్ లో ఒక్కసారి చూశాను చిరంజీవిగారిని. దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు ’లెట్ సెలబ్రేట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తుకువచ్చింది చిరంజీవిగారే. కొన్ని జనరేషన్ ను ఇన్ స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. ఛేజ్ యువర్ డ్రీమ్స్. సక్సెస్ మనల్ని ఫాలో అయితీరుతుంది అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవిగారే. సో, నా 25 ఏళ్ళ జర్నీ సెలబ్రేషన్ అంటే ఆయన ప్రెజెన్స్ లోనే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ మూమెంట్ లోనే కాదు. నా టీనేజ్ నుండి మీరు నాముందు ఇలానే వున్నారు..అని పోస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు