అనసూయ నేను మంచి స్నేహితులం.. రష్మీ గౌతమ్

ఆదివారం, 17 జూన్ 2018 (15:03 IST)
జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలతో ఆకట్టుకుంటున్న రష్మీ వెండితెరపై కూడా గ్లామర్ పంట పండిస్తోంది. ఈ మధ్య రియాల్టీ షోలు, స్టేజ్ షోల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మీ తన పారితోషికంను అమాంతం పెంచేసింది. ఇటీవల నార్త్‌ అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, దీంతో ఆమెను వద్దనుకున్నారని తెలిసింది. 
 
ఇంకా రష్మీ ఆ కార్యక్రమానికి రానని స్పష్టం చేసినా.. రష్మీని పేరును వాడుకున్నారు. కానీ తాను రానని చెప్పినా కూడా ఎందుకు తన పోస్టర్‌లను వాడుతున్నారంటూ షో నిర్వాహకులపై రష్మీ మండిపడింది. ఇలా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మీ వార్నింగ్ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో రష్మీ తోటి యాంకర్ అనసూయతో విబేధాలున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. 
 
తాను ఓ షో ఒప్పుకోకముందు కేవలం 13 ఎపిసోడ్‌లు మాత్రమే కంప్లీట్ చేసుకుంది. అయితే అనసూయ యాంకరింగ్ నుంచి తప్పుకున్న తరువాత యూట్యూబ్‌లో ఆ షో చూస్తూ నన్ను తిట్టేవాళ్లు అధికమయ్యారు. అనసూయకున్న ఫాలోయింగ్ అప్పుడే తనకు అప్పుడే అర్ధమైంది.. దానికి కారణం ఆ షోలో అనసూయ యాంకరింగ్ అంతబాగా చేస్తుండటమేనని చెప్పింది. వృత్తి పరంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. పైగా తామిద్దరం  మంచి స్నేహితులమని చెప్పింది. ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తినాలంటే అనసూయ ఇంటికే వెళతానని చెప్పుకొచ్చింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు