మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

ఠాగూర్

మంగళవారం, 21 అక్టోబరు 2025 (23:30 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా మిథాడియా గ్రామంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం సాగుతోంది. ఈ క్రమంలో ఆ వివాదాస్పద భూమిలో రాత్రికి రాత్రే మరో వర్గానికి చెందిన వారు నిర్మాణాలు చేపట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు అక్కడకు చేరుకుని నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి ట్రాక్టర్‌పై మహిళపై ఎక్కించి, తొక్కించాడు. ఆ తర్వాత వారిపై తండ్రీకుమారులు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు అక్కా చెల్లెళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు తక్షణం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... గ్రామానికి చేరుకుని నిందుతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. ట్రాక్టర్‌తో తొక్కించడం, గొడ్డలితో దాడి చేయడానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు