మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం - నటి రెంజూష మీనన్ బలవన్మరణం

మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:15 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. నటి రెంజూష మీనన్ (35) ఆత్మహత్యకు పాల్పడింది. టీవీ సీరియల్స్‌తో పాటు.. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకునివుంటారని సన్నిహుతులు, సహచరులు అంటున్నారు. 
 
తిరువనంతపురంలోని ఓ బహుళ అంతస్తు భవనంలో తన భర్తతో కలిసి ఉండే  రెంజూష మీనన్... ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 
 
అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. సన్నిహితులు మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని వుంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు, రెంజూష మీనన్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇదిలావుంటే, కొచ్చిన్‌కు చెందిన రెంజూష మీనన్.. బుల్లితెర యాంకర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత స్త్రీ, నిజలాట్టం, మగలుడే అమ్మ, బాలామణి వంటి అనేక సీరియల్స్‌తో పాటు సిటీ ఆప్ గాడ్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా తాను ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్టు ఓ రీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆమె ఎంతో యాక్టివ్‌గా కనిపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు