సైరా చిత్రాన్ని చూడమని తెలంగాణ గవర్నర్‌ను కోరిన చిరు

శనివారం, 5 అక్టోబరు 2019 (20:27 IST)
చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి విజయవంతంగా నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత గాధను తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి నటన అద్భుతంగా వుందని ప్రశంశలు వస్తున్నాయి. ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి శనివారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరాజన్ ను కలిసి సైరాను చూడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
 
సైరా టీమ్‌కి పార్టీ ఇచ్చిన బ‌న్నీ... ఒక గొడ‌వ‌లు లేన‌ట్టేనా..?
మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన సైరా ఇటీవ‌ల రిలీజై స‌క్స‌స్‌ఫు‌ల్‌గా ర‌న్ అవుతోంది. అయితే... ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలో చాలామంది స్పందించారు కానీ... బ‌న్నీ స్పందించ‌లేదు. దీంతో మెగా క్యాంపుకి, అల్లు క్యాంపుకి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుందిని వార్త‌లు వ‌చ్చాయి.
 
ఆ త‌ర్వాత సైరా రిలీజ్ టైమ్‌లో బన్నీ సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. సైరా టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా సైరా టీమ్‌కి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, అఖిల్ అక్కినేని, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, శ్రీకాంత్‌, త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి, వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్‌ శంక‌ర్‌, సుకుమార్‌, బ‌న్నీ వాసు, జెమినికిర‌ణ్  త‌దిత‌రులు పాల్గొన్నారు. దీంతో చిరు క్యాంపు, అల్లు క్యాంపు మ‌ధ్య గొడ‌వ‌లు అనే ప్ర‌చారానికి ఫుల్ స్టాఫ్ ప‌డిన‌ట్టే అంటూ మెగా అభిమానులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. అదీ.. సంగ‌తి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు