ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. నిత్యం తన భర్త తనను కొట్టడం, అనుమానాలతో వేధించడంతో విసిగిపోయిన సంతోష్ దేవి ఎలాగైనా తన భర్త మనోజ్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె గూగుల్, సోషల్ మీడియా సాయం తీసుకుంది.
నిందితురాలు ఆ మహిళ తన భర్తను చంపడానికి, హత్య చేసే విధానం, తప్పించుకునే మార్గాలు, ఒకవేళ పోలీసులకు దొరికితే శిక్ష విధించే విధానాల గురించి గూగుల్లో అనేక వీడియోలను చూసిందని పోలీసులు తెలిపారు. ఆమె హత్య చేసే ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, ఆమె హత్య కోసం కొత్త సిమ్ కార్డులను కూడా ఉపయోగించందని పోలీసులు తెలిపారు.