బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

ఠాగూర్

ఆదివారం, 23 మార్చి 2025 (11:30 IST)
తన బాలీవుడ్ ప్రియుడు కమ్ యాక్టర్ విజయ్ వర్మతో కటీఫ్ చేసుకున్న తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా ఇపుడు సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి బాలీవుడ్‌‍లో స్టామినా చూపించేందుకు వెళ్లిన తమన్నా... ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కేరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో ఈ యేడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ, పెళ్లి, కెరీర్ విషయంలో విబేధాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నది తాజా సమాచారం. 
 
ఈ క్రమంలో తాజాగా తమన్నా స్పందిస్తూ, 'భోళా శంకర్' తర్వాత తెలుగులో 'ఓదెల-2' చేస్తోంది. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అలాగే 'డార్లింగ్ పేరెంట్స్' అనే ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇవి కూడా గత ఈ యేడాది కమిటైన సినిమా అండ్ సిరీస్‌లు, వివాహ బంధంలోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కొత్తవి కమిట్ కాలేదు. విజయ్‌తో లవ్ బ్రేకప్ కావడంతో మళ్లి కెరీర్‌పై ఫోకస్ చేస్తుంది. 
 
అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తోన్న 'రేంజర్' మూవీ తమన్నా భాటియా ఫిక్సైనట్టు సమాచారం. 'హిమ్మత్ వాలా' తర్వాత అజయ్ దేవగన్‌తో కలిసి నటిస్తుంది. జగన్ శక్తి దర్శకత్వంలో 'లవ్ ఫిల్మ్' తెరకెక్కిస్తోంది. 'జంగిల్ అడ్వెంచర్' ఎక్స్ పీరియన్స్ మూవీగా రాబోతుంది. వచ్చే యేడాది రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చేబుతోంది. ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనుంది. మల్లీ కెరీర్‌పై దృష్టిసారించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు