అలియా భట్‌కు నోటీసులు.. కోర్టుకు రావాలంటూ ఆదేశం

శనివారం, 27 మార్చి 2021 (11:21 IST)
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ ప్రధానపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం పేరు "గంగూభాయి కఠియావాడీ" అనే సినిమాను ఆలియా భట్ చేస్తోంది. ఇది ఓ లేడీ డాన్ స్టోరీ. అయితే.. ఆ సినిమా స్టోరీ చనిపోయిన తన తల్లిని కించపరిచేలా ఉందంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
 
ఆ పిటిషన్‌ను విచారించిన అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ తెలిపారని.. వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనినదని తెలిపింది. ఆ తర్వాత మే 21లోపు కోర్టుకు రావాల్సిందిగా ఆలియా భట్, భన్సాలీ, సినిమా కథను రాసిన ఇద్దరు రైటర్లను ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు