ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ... చెమటకంపుతో నా దుస్తులు దుర్వాసన కొడుతున్నాయి. ఈ వాసనను భరించలేకపోతున్నాను. కాస్త విషం ఇస్తే తాగి చనిపోతాను. సూర్య కాంతి చూసి రోజులు గడిచిపోయాయి. నా చేతుల్లో ఫంగస్ వచ్చింది. జైలులో తను తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాంటూ కోర్టు ముందు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. కాగా దర్శన్ విన్నపం అనంతరం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్టు.
హీరో దర్శన్ తో రిలేషన్ షిప్ వున్న నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడనే కారణంగా చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా హింసించి హత్య చేసారు. ఈ కేసులో నటుడు దర్శన్ తో పాటు నటి పవిత్రా గౌడ మరికొందరిని నిందితులుగా తేల్చారు పోలీసులు. వీరందరికీ కోర్టు జైలు శిక్ష విధించి కేసును దర్యాప్తు చేస్తోంది.