ఎన్టీఆర్, ఏఎన్నార్.. చివరి వరకు స్నేహితులుగా మెలిగారు. వారి వారసులు నాగార్జున, బాలకృష్ణ ఒకే సమయంలో టాప్ హీరోలుగా చెలామణి అయినా వారిద్దరి మధ్య స్నేహం ఉంది. కానీ కొద్ది రోజులుగా నాగార్జున, బాలయ్య అత్యంత సాన్నిహిత్యంగా లేదని.. వారి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఇటీవల విశాఖపట్నంలో శనివారం రాత్రి జరుగనున్న టీఎస్సార్ అవార్డుల వేడుకలో వారిద్దరూ కలుసుకున్నారు.
తాజాగా టీఎస్సార్ ప్రకటించిన అవార్డుల జాబితాలో బెస్ట్ యాక్టర్గా నాగార్జున, బెస్ట్ హీరోగా బాలయ్య చోటు దక్కించుకున్నారు. అయితే వీరిద్దరూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం చూసిన చాలామంది... వారిద్దరి మధ్య గొడవలున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నాగార్జున కొట్టిపారేసుకున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... తమ ఇద్దరి మధ్య స్నేహం లేదని ఎన్నో పుకార్లు షికార్లు చేశాయని.. అయితే అవన్నీ అసత్యాలేనని తెలిపారు. విభేదాలు ఏమీ లేవని నాగ్ స్పష్టం చేయడంతో.. నాగ్, బాలయ్యల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.