''ఓంకార్'' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ''సిక్త్స్ సెన్స్'' ద్వారా (video)

బుధవారం, 7 మార్చి 2018 (16:36 IST)
ఓంకార్ మళ్లీ బుల్లితెరపై కనిపించబోతున్నాడు. వెన్నెల టీవీ షోతో పాపులర్ అయిన ఓం కార్.. ఆట డ్యాన్స్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. ఆపై దర్శకుడిగా మారిపోయాడు. ''రాజుగారి గది'' చిత్రంతో హిట్ కొట్టాడు. ఈ సినిమాకు తర్వాత టాప్ స్టార్స్ నాగార్జున, సమంతతో రాజు గారి గది-2 తీసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
తాజాగా స్టార్ మా ఛానల్‌లో ''సిక్త్స్ సెన్స్'' అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరపై సందడి చేసేందుకు సై అంటున్నాడు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ షో ట్రైలర్‌ ఇప్పటికే మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది.

ఈ ట్రైలర్లో ''ఐయాం బ్యాక్'' అంటూ దర్శనం ఇచ్చిన ఓంకార్ తన సృజనాత్మకతకు పనిచెప్పాడు. ట్రైలర్ వీడియో ఓవర్ బిల్డప్ అని టాక్ వచ్చినా.. షో రేంజ్ బాగా పెరిగిపోయే ఆస్కారం లేకపోలేదని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు