స్కాట్లాండులో అకీరా-ఆద్యలతో రేణు దేశాయ్

శనివారం, 9 జులై 2022 (16:20 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుందన్న సంగతి తెలిసిందే. ఆద్య, అకీరా ఫోటోలను అప్పుడప్పుడు నెట్టింట పోస్ట్ చేస్తూ వుంటుంది. 
 
మరోవైపు ఆద్య కూడా ఫొటోగ్రఫీలో చూపిస్తున్న ప్రతిభ గురించి చెబుతుంది. దీంతో అభిమానులు కూడా వారి ఫొటోలు చూసి సంతోషపడతారు. 
 
కరోనా సమయంలో వారి పట్ల జాగ్రత్తలు తీసుకుంది. కానీ మూడో వేవ్‌లో ముగ్గురు కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకున్నారు. దీంతో వారి కోసమే రేణుదేశాయ్ నిత్యం భయపడుతూ ఉంటుంది.
 
అకీరా గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో వెకేషన్ కోసం స్కాట్లాండ్ వెళ్లారు. అక్కడి వాతావరణం చూసి స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ రేణుదేశాయ్ పోస్టులు పెట్టడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. స్కాట్లాండ్‌లో చక్కర్లు కొడుతోంది. 
 
అక్కడి పరిస్థితులు చూసి మురిసిపోతోంది. ప్రకృతి పారవశ్యానికి పరవశమైపోతోంది. ఎంత బాగుందో అని సంబరపడిపోతోంది. పిల్లలతో సందడిగా గడుపుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు