ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ.

బుధవారం, 8 మార్చి 2023 (18:33 IST)
Puri jaganadh, Charmi kour
పూరీ జగన్నాథ్, ఛార్మి జంట చాల కాలం బయట కనిపించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ దెబ్బకు ఇద్దరూ అజ్జ్ఞాతం లో ఉన్నారు. ఇక బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ కనిపించారు.  పాన్ ఇండియా రేంజ్ లో తీసిన సినిమా తో వర్రు ఒక్కసారి హైలెట్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కు నెగెటివ్ అయింది.  ఆ సినిమా ఎఫెక్ట్ జనగణమన  పై పడింది. ఐటీ దాడులు జరిగాయి. 
 
అయినా విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఏదీ పూర్తి కాలేదు. ఖుషి కూడా కొంత షూట్ జరిగి ఆగిపోయింది. సమంత డేట్స్ సెట్ కాక పోవడంతో దిల్ రాజు సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ కొత్త కథను రాసాడు. ఏదిఏమైనా కమిట్ మెంట్ ప్రకారం మరల పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి ఏమిచేస్తాడో చూడాలి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు