మెగాస్టార్ చిరంజీవికి ఆమె కోడలు ఉపాసన థ్రిల్ కలిగించే విధంగా వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్చరణ్ నిర్మాతగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రానికి సంబంధించి ఆడియో వేడుకను డిసెంబర్ 23న చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి ఫ్యాన్స్తో సమావేశాలు కూడా జరిగాయి.
ఈ ఆడియో వేడుకకు తన సోదరుడు, హీరో పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు కూడా తెలియడంతో మరింత ఊపందుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి కుటుంబానికి సంబంధించిన హీరోలు అందరూ హాజరయ్యేలా ప్లాన్ చేశారు.