ఓ నిర్మాతగా ఇతర హీరోతో చిత్రాలను నిర్మించను : ఆయన కోసమే స్థాపించా...

బుధవారం, 9 జనవరి 2019 (11:00 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అటు హీరోగా రాణిస్తూనే ఇటు కొణిదల ప్రొడక్షన్ అనే సినీ నిర్మాణ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రమే 'ఖైదీ నంబర్ 150'. ఆ తర్వాత రెండో చిత్రంగా "సైరా నరసింహా రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
 
ఇకపోతే, తాను స్థాపించిన నిర్మాణ సంస్థలో ఇతర హీరోలతో కలిసి చిత్రాలు తీయబోనని స్పష్టం చేశారు. అయితే, ఇతర నిర్మాతలు మాత్రం తనను సంప్రదించి భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిద్దామని ప్రతిపాదన చేస్తే మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. అంతేగానీ, నాకు నేనుగా ఏ నిర్మాతనూ బలవంతం చేయబోనని, తాను మాత్రం ఒక నటుడిగానే ఉండాలనుకుంటున్నా అని చెప్పారు. 
 
అదేసమయంలో తన తాజా చిత్రం "వినయ విధేయ రామ" చిత్రం మాత్రం మరో గ్యాంగ్ లీడర్ కాదన్నారు. నలుగురు అన్నదమ్ముల కథే అయినప్పటికీ. ఈ చిత్ర కథ వేరు, స్క్రిప్టువేరు, నటీనటులు వేరు, దర్శకుడు వేరు, సన్నివేశాలు వేరు, స్క్రీన్ ప్లే వేరని రామ్ చరణ్ వివరించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు