హీరోయిన్లు బికినీ వేసుకుంటే నోరెళ్లబెట్టి చూస్తున్నారుగా.. మేం చేస్తే తప్పా? రష్మీ

శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:40 IST)
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. సినీ హీరోయిన్స్‌ను టార్గెట్ చేసింది. వెండితెరపై బికినీల్లో, గ్లామర్‌గా పెద్ద హీరోయిన్లు కనిపిస్తే.. నోరెళ్లబెట్టి చూస్తున్నారుగా.. అంటూ ప్రశ్నించింది. పెద్ద పెద్ద హీరోయిన్లు బికినీలు వేసుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరని.. కానీ బుల్లితెర నటులు మాత్రం గ్లామర్‌గా కనిపిస్తే విమర్శలు చేస్తున్నారని రష్మీ మండిపడింది. తాము మాత్రం ట్రెండీగా కనిపించడంలో తప్పులేదని చెప్పింది. 
 
జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో "ఎ" జోకులు, హాట్‌గా కనిపించే యాంకర్ రష్మీ.. ఈ ప్రోగ్రామ్ ద్వారానే మంచి పేరు కొట్టేసింది. ఇంకా గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్‌గా ఎదిగింది. ఆపై రెండు సినిమాలు చేసినా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బుల్లితెర మరింత దృష్టి పెట్టి.. సినీ అవకాశాల కోసం వేయి కనులతో ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే బుల్లితెర స్క్రీన్ పైనే గ్లామర్‌గా కనిపిస్తోంది. 
 
రష్మి మాత్రమే కాదు... అనసూయ, శ్రీముఖిలాంటి యాంకర్లు కూడా ఈ రూట్ లోనే వెళ్తున్నారు. వీరు వేసుకుంటున్న దుస్తులు, వీరి ప్రోగ్రాంలలోని వల్గారిటీపై కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వల్గారిటీ కామెంట్లను ఏమాత్రం పట్టించుకునేది లేదని రష్మీ స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి