పవన్‌తో విడాకులు.. అకీరా, ఆద్య గురించి మాట్లాడుతూ.. రేణు కన్నీళ్లు..

శనివారం, 5 డిశెంబరు 2020 (20:07 IST)
Renu Desai
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న నటి రేణు దేశాయ్.. ఆయనతో విడాకులు తీసుకున్నారు. తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్యలతో కలిసి జీవిస్తున్నారు. బద్రి, జానీ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్ నటనకు దూరం అయ్యింది. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
తండ్రికి దూరంగా ఉంటున్నప్పటికీ వారికి ఆ లోటు తెలియకుండా పెంచి పెద్ద చేస్తోంది. తాజాగా ఓ షో లో పాల్గొన్న రేణు దేశాయ్ తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న 'సుమక్క' యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ఓ కార్యక్రమంలో రేణు పాల్గొంది. రేణు దేశాయ్ బర్త్ డే నేపథ్యంలో ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌ని ప్రసారం చేశారు.
 
సుమ - రేణుదేశాయ్ మధ్య సరదా సంభాషణలతో ఈ షో ఫన్నీగా సాగింది. ఈ షోలో తన పిల్లలు ఆద్య అకీరాల గురించి మాట్లాడిన రేణు దేశాయ్ కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఆద్య - అకీరాలే తనకు సర్వస్వం అని.. తన పిల్లలిద్దరూ ఏదైనా ఫంక్షన్స్ లేదా పవన్ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడి డైరెక్టర్లు నటీనటులు ఆ ఇద్దరినీ చూసి తనకు ఫోన్ చేసి వారి గురించి మాట్లాడేవారని రేణు చెప్పుకొచ్చింది.
 
అకీరా, ఆద్య చాలా చక్కగా వున్నారని.. అందరితో కలిసిపోతున్నారని వాళ్లు చెప్పేవారని.. ఒక తల్లిగా ఆ క్షణాలు తనకెంతో సంతోషం కలిగించేవని తెలుపుతూ రేణు దేశాయ్ భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా సుమ 'బెస్ట్ మామ్ ఎవర్' అంటూ రేణు తన పిల్లలతో దిగిన ఫోటోను ముద్రించిన ఓ టీ కప్పుని ఆమెకు గిఫ్ట్‌గా అందించింది. ప్రస్తుతం 'సుమక్క' ఛానల్‌లోని రేణు దేశాయ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు