సాయిపల్లవి ఎదురుచూపులు ఎవరి కోసం..?

శనివారం, 9 మే 2020 (12:45 IST)
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఆ తర్వాత కణం, పడి పడి లేచే మనసు, ఎన్.జి.కె చిత్రాలతో ఆకట్టుకుంది. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు ఆమె మరింత వన్నె తెస్తుంది. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని.. ఆ పాత్రలో ఆమె తప్ప.. ఇంకెవరూ అలా నటించలేరు అనేలా నటించడం సాయి పల్లవి ప్రత్యేకత. 
 
ఫిదా సినిమా కోసం తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని మరీ.. నటించి శభాష్ అనిపించుకుంది. ఈ ఫిదా బ్యూటీ ప్రస్తుతం విరాట పర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు.
 
ఈ పోస్టర్లో సాయిపల్లవి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చోని ఎవరి కోసమే ఎదురు చూస్తుంది. అయితే... అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్థూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది ? ఎవరి కోసం ఆమె నిరీక్షణ ? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగ్‌లో ఉన్నవేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు దర్శకుడు వేణు ఉడుగుల.
 
ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసిందని చెప్పచ్చు. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతోంది ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తానికి విరాట పర్వం పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు