టాలీవుడ్లో వరుస పరాజయాలు తప్పట్లేదు. టాప్ హీరోల సినిమాలు ఫట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు సైతం హిట్ టాక్ను సంపాదించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకులకు హీరోయిన్ సమంత గట్టి క్లాస్ పీకిందని వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన టాప్ హీరోయిన్గా రాణిస్తూ మరో రెండేళ్లకు ఢోకా లేదన్నట్టుగా ఛాన్సులు సొంతం చేసుకుంటూ.. కెరీర్ పరంగా ముందడుగు వేస్తున్న సమంత ఓ సినిమా ఫంక్షన్లో ఇండస్ట్రీ డైరక్టర్లకు హితవు పలికింది.
కథలను ఎంచుకోవడంపై దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కథలు బాగుంటేనే, కలెక్షన్లకు ఢోకా ఉండదని సమంత వెల్లడించింది. కాబట్టి కథలు బాగుండేలా దర్శకులు ప్లాన్ చేసుకోవాలని, లేదంటే తొలి రోజు, తొలి షోకే సినిమా ఫ్లాఫ్ అంటూ లక్షల్లో ప్రేక్షకులకు మెసేజ్లు వెళ్తాయని సమంత హెచ్చరించింది. ఈ మెసేజ్లే సినిమా ఫట్ కావడానికి, కలెక్షన్స్ లేకుండా చేసేందుకు కారణమవుతాయని సమంత వెల్లడించింది.