లాక్ డౌన్‌తో ఇబ్బందిపడుతున్న హిజ్రాలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేయూత

శుక్రవారం, 15 మే 2020 (21:56 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పలువురికి తనవంతుగా సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన జి.హెచ్.ఎం.సి, కర్నూలు పారిశుద్ద్య కార్మికులకు నెలరోజుల పాటు బాదం పాలు, మజ్జిగ అందచేస్తున్నారు. ఇప్పుడు హిజ్రాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.
 
అంతేగాకుండా వీళ్లకు సాయం చేయడానికి మరికొంతమంది ముందుకు రావాలని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఈ లాక్డౌన్ టైమ్‌లో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు హిజ్రాలు. వాళ్ళు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి ప్లేస్ దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు.
 
ఇవి కాక సమాజంలో వాళ్ళ పట్ల ఉండే వివక్ష, అపోహలు వాళ్ళ ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఓటర్ కార్డ్ ఉండదు. రేషన్ కార్డ్ ఉండదు. Health care పథకాలు వర్తించవు. సెన్సిటివ్‌గా ఉందాం. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. శేఖర్ కమ్ముల చేసిన సాయానికి కృతజ్ణతగా హిజ్రాలు ‘‘థాంక్యూ శేఖర్ కమ్ముల’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. మరింత మంది తమను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు.
 
‘‘ The Tollywood Godavari movie director Sekhar Kammula gari COVID19 support reached the East Godavari District Trans community today and reaching more districts of Andhra Pradesh slowly...In this hard hour there are still more places in the state of Andhra Pradesh where the transgender community needs support as they are stranded to go out for daily earnings and their hard earned savings have almost exhausted...! Dear Tollywood expecting much more such humans from you...’’

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు