సోషల్ మీడియాలో అలా చేశారో.. కేసులు పెట్టి.. కోర్టుకు లాగుతా: శ్రీరెడ్డి

బుధవారం, 2 మే 2018 (14:30 IST)
సోషల్ మీడియాలో తనను అసభ్యంగా తిడుతూ.. బెదిరిస్తూ.. కామెంట్లు, వీడియోలు పెట్టే వారిపై శ్రీరెడ్డి సీరియస్ అయ్యింది. తనపై ఎవరు కామెంట్ చేసినా వారిపై క్రిమినల్, సైబర్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేస్తానని.. సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని తెలిపింది.


గతంలో జనసేనాని పవన్ కల్యాణ్‌పై.. ఆయన కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తూ.. అభ్యంతరకర వీడియోలు పోస్టు చేస్తున్నారు. దీనిపై శ్రీరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై కేసులు పెడతానని హెచ్చరించింది.
 
ఇదిలా ఉంటే.. తాజాగా మంగళవారం నాడు రామ్ గోపాల్ వర్మ స్టైల్‌లో తన ఒట్టు తీసి గట్టుమీద పెట్టేసి.. సీనియర్ నటి జీవిత రాజశేఖర్‌కి సంబంధించిన పలు హాట్ వీడియోలను ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది.

అయితే అవి గతంలో జీవిత నటించిన పలు సినిమాల్లోని రొమాంటిక్ సీన్లు, సాంగ్స్‌ను తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. హీరోయిన్లు స్క్రీన్ మీద కనిపించేందుకు ఇలాంటి సీన్లు చేస్తారనే విషయం శ్రీరెడ్డికి తెలియదా అన్నట్లు ఎద్దేవా చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు