హీరోలపై వాళ్లు అలిగి రాలేదంట... శ్రీరెడ్డి: చిరంజీవి ఏడవలేదు...

మంగళవారం, 1 మే 2018 (14:40 IST)
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమధ్య నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలంగా సైలెంటుగా వుంటోంది. తాజాగా మరోసారి తన ఫేసుబుక్కులో ఓ పోస్టు చేసింది. అదేమిటంటే...  "అమెరికాలో మా అసోషియేషన్‌ నిర్వహించిన ప్రొగ్రాంకు జనం రాలేదంట. బిల్డింగ్‌ కోసం డబ్బులు అడగటం కోసం చేసిన ప్రోగ్రాంకి జనాలు రాకుండా తమ నిరసనలు వ్యక్తం చేశారంట. ఎందుకంటే హీరోలెవరూ ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదని అలిగారంట" అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది. మరి దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
ఇదిలావుంటే డల్లాస్‌లో మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ఉద్యమించడం లేదంటూ అక్కడ కొంతమంది నల్లచొక్కాలు ధరించి తమ నిరసనను తెలిపారు. దీనితో చిరంజీవి అవాక్కయ్యారు. మరోవైపు చిరంజీవి డల్లాస్ సభలో భావోద్వేగానికి గురయ్యారంటూ ఓ వార్త హల్చల్ చేసింది. దీనిపై ఎన్నారైలు క్లారిటీ ఇచ్చారు.
 
అదంతా ఉత్తదేనంటూ కొట్టిపారేశారు. చిరంజీవిగారు ఏడవలేదనీ, అదంతా పాత వీడియో క్లిప్పింగ్ అని తెలిపారు. పాత వీడియో క్లిప్పింగులను ఇప్పుడు కొంతమంది నెట్లో పెట్టి ప్రచారం చేస్తున్నారంటూ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు