ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్-2. హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రమిది. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే, ఈ సినిమా చాలా ప్రచారాన్ని పొందింది. కాగా, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన మొదటి మోషన్ పోస్టర్ 2025 మే రెండవ వారంలో విడుదల కానుంది. అభిమానుల కోసం ఈ డేట్ ప్రకటించారు.