సునామీ కిట్టి, చరిష్మా జంటగా 'కోర' అనే చిత్రాన్ని దర్శకుడు ఒరాటశ్రీ భారీ ఎత్తున తెరకెక్కించారు. ఈ సినిమాలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి.