చంద్ర‌మోహ‌న్‌, క‌విత‌ల‌కు బుల్లితెర పుర‌స్కారాలు

శుక్రవారం, 25 నవంబరు 2016 (14:17 IST)
అల‌నాటి మేటి క‌థానాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్, నాటి మేటి హీరోయిన్‌, న‌టి క‌విత బుల్లితెర‌పై ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు అందుకున్నారు. విబి (విష్ణు బొప్ప‌న‌) ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ -2016  పుర‌స్కారాల్లో లెజెండ‌రీ అవార్డును చంద్ర‌మోహ‌న్‌, జీవ‌న సాఫ‌ల్య పుర‌స్కారాన్ని న‌టి శ్రీ‌మ‌తి క‌వితల‌కు ప్ర‌క‌టించారు. 
 
ప్ర‌భాక‌ర్ ఆల్‌రౌండ‌ర్ పుర‌స్కారాన్ని అందుకోనున్నారు. ఈ పుర‌స్కారాల్ని డిసెంబ‌ర్ 4న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగే ఓ ప్ర‌ైవేటు కార్య‌క్ర‌మంలో వారికి ప్రదానం చేస్తామని అవార్డు క‌ర్త‌లు విష్ణు బొప్ప‌న తెలియ‌జేశారు. వెండితెర, బుల్లితెర న‌టీన‌టులు, ప్ర‌ముఖులు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పేద క‌ళాకారుల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు. 
 
బుల్లితెర‌పై వివిధ రంగాల్లో ప్ర‌తిభ చూపిస్తున్న న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ పుర‌స్కారాల్ని అందిస్తూ గ‌త యేడాది విబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ పుర‌స్కారాల్ని ప్రారంభించింది. 2015లో సీనియ‌ర్ న‌టులు రంగ‌నాథ్‌, రాళ్ల‌ప‌ళ్లి వంటి ప్ర‌ముఖుల‌కు పుర‌స్కారాల్ని అందించింది. 

వెబ్దునియా పై చదవండి